Wednesday, May 1, 2024

Peddapalli: పేదలందరికీ సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్యే విజయరమణ రావు

జూలపల్లి (ప్రభ న్యూస్) : పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలియజేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని కుమ్మరి కుంట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని, ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకం అందించడమే తమ లక్ష్యమన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరోగ్యశ్రీ 5లక్షల నుండి 10లక్షల రూపాయలకు పెంపు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రెండు హామీలను నెరవేర్చామని, అలాగే అధికారులంతా ఇది తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమనే ఆలోచనతో పనిచేయాలని తెలిపారు.

అలాగే రేషన్ కార్డు లేని వారు అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు దరఖాస్తు పత్రాన్ని జత చేసి స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు ఇవ్వాలన్నారు. ప్రజా పాలనకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల మనసు గెలుచుకోవాలని, పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తానని, అలాగే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని, అలాగే రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సేవకులుగా మారడానికి నాయకులకు ప్రజాపాలన ఒక మంచి అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement