Monday, April 29, 2024

Corona Counts – కొత్త‌గా 602 క‌రోనా పాజిటివ్స్…. ఫైవ్ డెత్స్ …

ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 600కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడ్డాయి.

తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,371కి పెరిగింది.దేశంలో ఇప్పటి వరకూ 4,44,77,272 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 263కి చేరిన జేఎన్.1 కేసులు ఇదిలా ఉండగా.. భారత్లో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలో ఈ తరహా కేసులు తాజాగా 200 దాటాయి. కేరళలో ఏకంగా 133 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గోవాలో 51, గుజరాత్లో 34, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 9, రాజస్థాన్లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కేసు నమోదైనట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement