Wednesday, May 8, 2024

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట..

కాల్వశ్రీరాంపూర్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తుందని ఎంపీపీ నూనె టి సంపత్‌, జడ్పిటిసి వంగళ తిరుపతిరెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని కునారం గ్రామంలోని సుందర్‌ రాజు ఇంటి నుండి రాజమల్లు ఇంటి వరకు రూ.2.20లక్షల సిడిపి నిధులతో చేపట్టే సిసి రోడ్డు నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధికి ఏ రాష్ట్రంలో లేని విధంగా నిధులు కేటాయిస్తూ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి డొంకెన విజయ మొగిలి, ఎంపీటీ-సీ కొల్లూరి రమా రాజమల్లు,
మాజీ సింగిల్విండో చైర్మన్‌ కొట్టే సమ్మయ్య, సభ్యులు, నాయకులు బొట్టు-కు రవి, బందెల శంకర్‌, సిరిపురం శ్రీనివాస్‌, సుందర్‌ రాజు, మొలుగురి రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement