Thursday, May 9, 2024

ముంపు ప్రాంతాల బాధితుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించాలి : మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప‌ర్య‌టించారు. ధర్మపురి లోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండ‌డంతో లోతట్టు ప్రాంతాల్లో మంత్రి ప‌ర్య‌టించి ముంపునకు గురైన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వ‌ర‌ద బాధితుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అసాధారణ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని మంత్రి కొప్పుల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందిచాలన్నారు. ముంపు ప్రాంత బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement