Sunday, April 28, 2024

KNR: గోదావరిలో రెండు మృతదేహాలు.. వెలికి తీసిన జాలర్లు

గోదావరిఖని(ప్రభ న్యూస్): గోదావరిలో రెండు మృతదేహాలు లభ్యమైన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారులో చోటుచేసుకుంది. గోదావరిఖని శివారు ప్రాంతమైన నదిలో గురువారం ఉదయం రెండు మృతదేహాలు నీటిపై తెలియాడడంతో జాలర్లు మృత దేహాలను బయటకు తీశారు.

గోదావరిఖని తిలక్ నగర్​కు చెందిన నజీముద్దీన్ రెండు రోజుల క్రితం నదిలో దూకడంతో జాలర్లు గాలింపు చర్యలు చేపట్టినా దొరకకలేదు. రెండ్రోజుల త‌ర్వాత మృతదేహం నీటిలో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మృత దేహాన్ని బయటకు తీయడానికి జాలర్లు వెళ్లిన సమయంలో మరో మృత దేహం కనిపించించింది. మరో మృతుడు శివాజీ నగర్ కు చెందిన కొయ్యడ రాకేష్ గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement