Sunday, April 28, 2024

HYD: విద్యార్థులు ప్ర‌భుత్వం అందించే వ‌స‌తుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి..ఎమ్మెల్యే మాధ‌వ‌రం

బాలానగర్ మండలం హైదర్ నగర్‌లో గల అల్పసంఖ్యాకుల మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలను కూక‌ట్‌ప‌ల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గురుకుల పాఠశాల ఉచిత విద్య సందర్భంగా 5, 6 7, 8 తరగతి లకు ప్రవేశాలు జరుగుతున్నాయని ఇందులో భాగంగా మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

గురుకుల పాఠశాల నిర్మాణం కొరకు దూలపల్లి లో మరొక రెండున్నర ఎకరాలు కేటాయించామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశంసా పత్రాలను అందించారు. అనంత‌రం విద్యార్థులకు నోటుబుక్స్, యూనిఫామ్, బూట్లు, దుప్పట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసోద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జితేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement