Monday, April 29, 2024

AP: జ‌గ‌న్‌కు ఓట‌మిని గిప్ట్ గా ఇస్తాం… అమ‌రావ‌తి రైతుల శ‌ప‌థం …

రాజధాని అమరావతి ని నాశనం చేయాలనుకున్న సీఎం జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించడం ద్వారా రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తామని ఆ ప్రాంత రైతులు శ‌ప‌థం చేశారు. అమరావతి ఉద్యమం 1500 రోజులకు చేరిన సందర్భంగా రాజధాని పరిధిలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

వెలగపూడిలో ఐకాస నేత పువ్వాడ సుధాకర్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ఇవాళ సమర శంఖం పూరిస్తామన్నారు. గత 1500 రోజులుగా పోరాడుతున్న రైతులు రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా రాజకీయ నిర్ణయం తీసుకుని జగన్‌ను ఓడిస్తారని చెప్పారు. మహిళా రైతులు మాట్లాడుతూ అమరావతికి భూములిచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టిన జగన్.. రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన అనాలోచిత నిర్ణయంతో అనేక మంది చనిపోయారని, మరో రెండు నెలల్లో రాజధాని రైతుల కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement