Monday, April 29, 2024

తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలని సీపీకి ఫిర్యాదు

భూ వివాదంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి టిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్, ఎస్ఐలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. వెంటనే మల్లన్నపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెన్నం రవీందర్, కాశిపాక వాసు, బొంకూరి అఖిల్,నిఖిల్, కళ్యాణ్,హరీష్, జునిద్,శ్రీనివాస్,రవికాంత్,అఖిల్ వర్మలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement