Thursday, April 25, 2024

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు ఋణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి తగ్గట్టుగా సరఫరాకి అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పారు.17000mw పైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణాను ప్రోత్సహించాల్సిన కేంద్రం వివక్ష చూపెడుతున్నదన్నారు. రాష్ట్రానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సంస్థల రుణాలను రాకుండా కేంద్రం కుట్రలు చేసిందని పేర్కొన్నారు.

తెలంగాణపై కేంద్ర కక్షపూరిత వైఖరిని ఖండిస్తున్నామన్నారు. రావాల్సిన నిధులపై చట్టప్రకారం పోరాటం చేస్తామని ఉద్గాటించారు. విద్యుత్ అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇతర సంస్థలు తెలంగాణాకు విద్యుత్ అమ్మొద్దని కేంద్రం బెదిరిస్తుందని ఆరోపించారు.కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా.. కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయరని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కేంద్రానిదేన్నారు.బొగ్గు దిగుమతుల ధరలు, పెట్రో, డీజిల్ చార్జీలు పెరగడంతో పాటు, కేంద్రం అడ్డగోలుగా పన్నులు విధించడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి ప్రజల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement