Thursday, May 2, 2024

రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

కాల్వశ్రీరాంపూర్‌: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మండల ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు గొడుగు రాజ కొమురయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, పార్టీ జెండాలను ఆవిష్కరించి స్వీట్లు- పంచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క మంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సబ్బండ వర్గాలకు సమన్యాయం చేస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్‌, జడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, సింగిల్విండో చైర్మన్‌లు చదువు రాంచంద్రారెడ్డి, గజవల్లి పురుషోత్తం, మార్కెట్‌ చైర్మన్‌ కొట్టే సుజాత రవి, సర్పంచులు, నాయకులు, ఆడెపు రాజు, మర్రి మహేందర్‌, నిదానపురం దేవయ్య, జిన్నా రామచంద్రారెడ్డి, నూనె టి కుమార్‌, కూకట్ల నవీన్‌, సదానందం, సారంగపాణి, బూర్ల రవి, సదయ్య, కనుకయ్య, రజాక్‌, ప్రసాద్‌, రవి, సర్పంచులు, ఎంపీటీ-సీలు, ఉప సర్పంచులు, సింగిల్‌ విండో, మార్కెట్‌, డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement