Thursday, April 25, 2024

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం, వెండి ధ‌ర‌లు మరోసారి స్వ‌ల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ. 69 పెరిగి రూ.46,906కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం బంగారం ధ‌ర 46,837 వ‌ద్ద ముగిసింది. అదేవిధంగా వెండి ధ‌ర కూడా మంగ‌ళ‌వారం స్వ‌ల్పంగా పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ.255 పెరిగి రూ.67,890కి చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి రూ.67,635 వ‌ద్ద ముగిసింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర‌ 1,778 అమెరిక‌న్ డాల‌ర్‌లు, ఔన్స్ వెండి ధ‌ర 26.15 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement