Saturday, May 4, 2024

11 మంది ఎస్‌ఐల బదిలీలు

పెద్దపల్లి, మే 11 (ప్రభన్యూస్‌): రామగుండం కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న 11 మంది సబ్‌ ఇన్స్‌ పెక్టర్లను బదిలీ చేస్తూ రామగుండం పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవాపూర్‌లో పనిచేస్తున్న విజయేందర్‌ను సుల్తానాబాద్‌కు, పొత్కపల్లిలో పనిచేస్తున్న మహేందర్‌ను పెద్దపల్లికి, పెద్దపల్లిలో పనిచేస్తున్న రాజేశ్‌ను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు, టాస్క్‌ఫోర్స్‌ మంచిర్యాలలో పనిచేస్తున్న రామకృష్ణను పొత్కపల్లికి, బసంత్‌నగర్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్‌ను కాల్వశ్రీరాంపూర్‌కు, గొదావరిఖని వన్‌టౌన్‌లో పనిచేస్తున్న వెంకటేశ్‌ను బసంత్‌నగర్‌కు, పెద్దపల్లిలో 2వ ఎస్‌ఐగా పనిచేస్తున్న మౌనికను మంచిర్యాల సీసీఆర్‌బీకి, వీఆర్‌ మంచిర్యాలలో ఉన్న రవికుమార్‌ను బెల్లంపల్లి రెండో ఠాణాకు, బెల్లంపల్లి రెండో ఠాణాలో పనిచేస్తున్న ఆంజనేయులును దేవాపూర్‌కు, శ్రీరాంపూర్‌లో పనిచేస్తున్న మానసను మంచిర్యాల వీఆర్‌కు, సీసీఎస్‌లో పనిచేస్తున్న సమ్మయ్యను గోదావరిఖని వన్‌టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement