Sunday, April 28, 2024

ట్రాక్టర్ బోల్తా.. కూలీలకు గాయాలు

వ్యవసాయ కూలీలు ట్రాక్టర్ లో పనులకు వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి పలువురికి గాయాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం లో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ లో సోమవారం సుమారు 25 మంది కూలీలు వరి నాటు వేయడానికి వెళ్తున్నారు. ప్రమాదవశతు పొలం సమీపంలో ట్రాక్టర్ డబ్బా ఒకపక్క కుంగిపోగా కూలీలు ఒకరిపై ఒకరు పడగా తొట్ల వనిత, తిప్పనవేన లక్ష్మి, కందుకూరి మహేశ్వరి, భాషనవేన స్వరూప, మెర్గ వైన స్వరూప, తొట్ల శైలజ, మర్రి స్వరూప, తోట్ల నాగేంద్ర, మర్రి లక్ష్మి తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి.

వీరిని ప్రధమ చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దీంతో గ్రామంలో పెద్ద పెను ప్రమాదం తప్పిందని పలువురు గ్రామస్తులు వాపోయారు. బాధితులను ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు, ఎంపిటిసి మాదాసి సువర్ణ చందు, ఉపసర్పంచ్ సూద్ధాటి కరుణాకర్ రావు,తో పాటు పలువురు నాయకులు పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement