Sunday, May 5, 2024

టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ బీజేపీ నాయకుడు

కూకట్ ప‌ల్లి నియోజకవర్గం KPHB కాలనీ డివిజన్ కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు వెంకట్ రెడ్డి సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాను కప్పిన కేటీఆర్ వెంకట్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేలాది కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం పట్ల ఆకర్షితులై బీజేపీ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని వెంకటరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement