Sunday, May 5, 2024

పిఆర్సీ పై టీఎన్‌జీఓల హర్షం..

పెద్దపల్లి ‌: తెలంగాణ ప్రభుత్వం పిఆర్సీ ప్రకటించడం పట్ల జిల్లా టీ ఎన్జీవోల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. టీఎన్జీవోల సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు బొంకురి శంకర్‌, కార్యదర్శి రాజ నరేందర్‌లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌లను కలిసి పుష్పగుచ్ఛం అందింఛి కృతజ్ఞతలు తెలిపారు. 30 శాతం ఫిట్‌మెంట్‌, 61 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపుతోపాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకునేలా ముఖ్యమంత్రి కెసిఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులంతా గర్వపడేలా ఫిట్‌మెంట్‌ ఉందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్‌ రఘువీర్‌ సింగ్‌తోపాటు- పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement