Saturday, April 27, 2024

కేసులకు భయపడేది లేదు : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించారని.. అందులో భాగంగా ఆదివారం తనకు నోటీసులు జారీ చేశారన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు పెట్టారని, జైలుకు కూడా వెళ్లానన్నారు.

కేసులకు భయపడే సమస్య లేదని ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందన్నారు. అధికారం కోసం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, వాటిని అమలు పరచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వపై ఉందన్నారు. ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేయడమే తమ అధినేత కేసిఆర్ తమకు నేర్పారని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement