Sunday, May 5, 2024

ఎస్ బి ఐ భారీ చోరి – ఆరు కిలోల బంగారం , రూ 18 లక్షల నగదు అప‌హ‌ర‌ణ‌..

పెద్దపెల్లి జిల్లాలో దొంగలు బ్యాంకుకు కన్నం వేశారు. జిల్లాలోని గుంజపడుగు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో భారీ చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు వెనుక కిటికీ పగలగొట్టి దొంగలు బ్యాంకు లోనికి ప్రవేశించి గ్యాస్ కట్టర్ ద్వారా లాకర్ ను పగలగొట్టి 6 కిలోల బంగారం, 18 లక్షల రూపాయల నగదు అపహరించుకుని వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ, ఓఎస్డీ శరత్ పవార్, డిసీపీ రవీందర్ తో పాటు పోలీసు అధికారులు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement