Thursday, May 2, 2024

నిబంధనలు పాటించకపోతే వాహనాలు సీజ్ – సిఐ ప్రదీప్ కుమార్

రవాణా శాఖ నిబంధనలు పాటించకపోతే వాహనాలు సీజ్ చేస్తామని పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ చౌరస్తా వద్ద నంబర్ ప్లేట్లు, ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధమన్నారు. చలాన్లు పడకుండా ఉండేందుకు వాహనదారులు నంబర్ ప్లేట్లు వాడడం లేదని, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో వాహనాలను గుర్తించడం కష్టతరమవుతుందన్నారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని నిబంధనలు పాటించకపోతే వాహనాలు సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాజేష్, మౌనిక తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement