Sunday, April 28, 2024

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గోదావరిఖని: పట్టణంలోని గాంధీ నగర్‌ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ కార్యాలయం ముందు నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు పార్టీ జెండాని ఆవిష్కరించారు. అనంతరం కేక్‌ క ట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పని చేస్తుందన్నారు. పాదయాత్రలు చేసి ప్రజల మనసులను 9 నెలల్లోనే గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్‌టీఆర్‌ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, టీఎన్‌టీయూసీ సంయుక్త కార్యదర్శి బైరం శంకర్‌, గుండెబోయిన ఓదెలు, అరకిలో బాబు, చిటికెల రాయలింగం, అరిగెల కళావతి, పెగడపల్లి రాజనర్సు, గుడిపాటి రవీందర్‌ రెడ్డి, చిటికెల అశ్విని, దాసరి దుర్గయ్య, దేవేందర్‌ రెడ్డి, భవాని సీను, స్వరూప, సౌజన్య, లలిత, శారద, కోమల, అంజలి, ప్రవళిక, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement