Sunday, May 12, 2024

రాజన్న ఆలయంలో కోవిడ్‌ నిబంధనలు – శివకళ్యాణం, రథోత్సవానికి భక్తులుదూరం

వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని నివారించడంలో భాగంగా కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉంచుతున్నట్లు కార్యనిర్వహణ అధికారి కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 31, ఏప్రిల్‌ 2 తేదీల్లో నిర్వహించనున్న శివ కళ్యాణోత్సవం, రథోత్సవ వేడుకలను అంతరంగికంగానే నిర్వహిస్తామని, కరోనా నిబంధనల దృష్ట్యా ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement