Tuesday, May 14, 2024

మాజీ కార్పోరేటర్‌కు పరామర్శ

గోదావరిఖని: కార్పోరేషన్‌ పరిధిలోని మాజీ కార్పొరేటర్‌ తోట అనసూర్య భర్త తోట మోహన్‌రావు మృతిచెందగా మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ సోమవారం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటు-ంబ సభ్యులు, మాజీ కార్పొరేటర్‌ తోట అనసూయ
, తోట వేణు, తోట శ్రీనివాస్‌లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ బాలసాని తిరుపతి గౌడ్‌, బీజేపీ బిసి సెల్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్‌ పిడుగు కృష్ణ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి దేవేందర్‌, భాషబోయిన వాసు, బుంగ మహేష్‌, అజీమ్‌, బండారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement