Tuesday, July 23, 2024

AP : నేడు ప్ర‌ధాని నామినేష‌న్‌కు చంద్ర‌బాబు

వార‌ణాసిలో నేడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ లోక్‌స‌భ స్థానానికి నామినేష‌న్ వేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ఆయ‌న నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని ఆహ్వానం పంపారు. అందులో భాగంగానే టీడీపీఛీఫ్ చంద్ర‌బాబుకు ఆహ్వానం పంపారు. కాగా చంద్ర‌బాబు ఇవాళ ప్ర‌ధాని నామినేష‌న్‌కు వెళ్ల‌నున్నారు.

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి వారణాసికి వెళతారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఎన్డీఏ సమావేశం వారణాసిలోనే జరుగుతుంది.

ఈ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ ఈసారి ఎన్డీఏ మిత్ర పక్షాలతో ఎన్నికలకు ముందుగానే ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సమయంలో ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. సాయంత్రం తిరిగి అమరావతికి తిరిగిరానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement