Tuesday, April 30, 2024

అనుమానాస్పదంగా వివాహిత మృతి

అనుమానాస్పదంగా వివాహిత మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరు లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేడం అనూష (27) ఆదివారం తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లి మృతి చెందిందని భర్త పేర్కొన్నాడు. అనుష గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. సమాచారం అందుకున్న బసంత్ నగర్ ఎస్సై మహేందర్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనూష శరీరం పచ్చబడి ఉండడం తో ఆమె మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement