Sunday, April 28, 2024

బిల్లులు రావడంలేదని సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

బిల్లులు రావడంలేదని మనస్థాపం చెందిన సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన సర్పంచ్ రవీందర్ రెడ్డి బిల్లులు రావడంలేదని మండల పరిషత్ ఆఫీసులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. సర్పంచ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అప్పులు చేసి గ్రామంలో పనులు చేస్తే పిల్లలు రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement