Wednesday, May 15, 2024

రాష్ట్ర ఇండస్ట్రీ సెల్‌ కన్వీనర్‌గా ‘సంతోష్‌రెడ్డి’

చిగురుమామిడి: బీజేవైఎం రాష్ట్ర ఇండస్ట్రీ సెల్‌ కన్వీనర్‌గా మండలంలోని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఏలేటి సంతోష్‌రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ తొలి జిల్లా తడిసిన అధ్యక్షులు లింగారెడ్డి నుండి పార్టీ కోసం తమ కుటుంబం పనిచేస్తోందని, మండలంలో ముదిమాణిక్యం, రామంచ గ్రామాల ఎంపీటీసీగా తన తండ్రి ఏలేటి రవీందర్‌రెడ్డి బిజెపి తరపున పోటీ చేసి గెలుపొందారన్నారు. పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తించి రాష్ట్ర బీజేవైఎంలో తనకు అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్‌, సౌత్‌ రైల్వే బోర్డు మెంబర్‌ తడిసిన రాజశేఖర్‌రెడ్డి, కరీంనగర్‌ , సిద్దిపేట జిల్లాల అధ్యక్షులు గంగడి కృష్ణరెడ్డి, దూది శ్రీకాంత్‌రెడ్డి, మండల అధ్యక్షులు దుడ్డెల లక్ష్మి నారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement