Saturday, May 18, 2024

రాళ్లవాగు కుడి కాలువ పరిశీలన..

కథలాపూర్‌: మండలంలోని భూషణరావుపేటలో రాళ్లవాగు కుడికాలువ ఆయకట్టు కింద ఉన్న రైతుల పొలాలకు నీరందించేందుకు రాళ్లవాగు కుడి కాలువ పూడిక తీస్తే రైతులకు లాభం జరుగుతుందని, ఇందుకోసం జేసీబీ సహాయంతో పనులు ప్రారంభించాలని సర్పంచ్‌ కూన సులోచన శ్రీనివాస్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ)కి వినతి పత్రం అందజేశారు. దీంతో రాళ్లవాగు కుడి కాలువను సర్పంచ్‌ కూన సులోచన శ్రీనివాస్‌, ఎస్‌ఈ, ఈఈ, డీఈ, ఏఈలతో కలిసి కాలువను పరిశీలించారు. ప్రస్తుతం రైతులు సమన్వయంతో చేసుకోవాలని, వర్షాకాలం వరకు కుడి కాలువ పూడిక పనులకు సంబంధించి నిధులను, కూలీలను సమకూరుస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో వార్డుసభ్యులు లింగారెడ్డి, నాయకులు వినోద్‌రెడ్డి, బోడ మాధవరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement