Thursday, May 2, 2024

రహదారికి రూ. 3.68కోట్లు..

ఎల్లారెడ్డిపేట: కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ద్వారా రూ. 3 కోట్ల 68 లక్షల నిధులు మంజూరు చేసినట్లు భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లె నుండి వయా దుమాల, అక్కపల్లి, శివగాలపల్లి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ద్వారా నిధులు మంజూరు చేయడం పట్ల కరీంనగర్‌ పార్లమెంటు- సభ్యులు బండి సంజయ్‌కి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement