Sunday, May 5, 2024

ఎల్లమ్మ ఆలయంలో లైట్లకు విరాళం..

కాల్వశ్రీరాంపూర్‌: మండలంలోని మీర్జంపేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కొలుపు సందర్భంగా ఆలయంలో లైట్ల ఏర్పాటుకు మాజీ ఎంపీటీసీ డాక్టర్‌ పోశాల సదానందం రూ. 5016ల విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 4న పోచమ్మ బోనాల సమర్పణ, 5న పుట్టకు పాలు పోయడం, 6న సాయంత్రం ఎల్లమ్మ బోనాలు, రాత్రి ఎల్లమ్మ కొలుపు, కథ, 7న బలి కార్యక్రమం ఉంటుందని వివరించారు. గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు దేశిని సమ్మయ్య గౌడ్‌, సభ్యులు ఉయ్యాల పోచాలు, ఉయ్యాల స్వామి, ఉయ్యాల రాజేశం, ఉయ్యాల సుధాకర్‌, పంజాల సారయ్య, కునూరి రాములు, దాసరి శ్రీనివాస్‌, మూల సందీప్‌, ఉయ్యాల సంపత్‌, తిప్పని అనిల్‌, తిప్పని సాగర్‌, గౌడ కులస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement