Sunday, April 28, 2024

Peddapalli : ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. జెండా ఎగురవేసిన కలెక్టర్ ముజమ్మిల్

గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇవాళ కలెక్టరేట్ ఆవరణలోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అరుణ శ్రీ శ్యాంప్రసాద్ లాల్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, డీసీపీ, ఏసీపీలతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement