Tuesday, May 7, 2024

రాజన్నను దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే

సుప్రసిద్ధ వేములవాడ రాజరాజేశ్వర స్వామి రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ దర్శించుకున్నారు. సోమవారం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. కోడెను కట్టి మొక్కు చెల్లించారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యే చందర్ కు వేద ఆశీర్వచనం అనంతరం స్వామి వారి చిత్ర పటంతో పాటు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలతో పాటు పెద్దపెల్లి జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement