Sunday, May 5, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి.. జిల్లా కలెక్టర్ సంగీత

పెద్దపల్లి, (ప్రభ న్యూస్) ప్రజా సమస్యల కొరకే ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జిలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి పలు వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement