Thursday, April 25, 2024

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి

తిరుమల శ్రీవారిని ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా ద‌ర్శించుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ… స్వామి వారి ఆశీర్వాదం కోసం కుటుంబ సమేతంగా తిరుమల వ‌చ్చామ‌న్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అందరూ చూస్తున్నారు, సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నార‌న్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాల‌న ముందుకు సాగుతుంద‌న్నారు. వెంకటేశ్వర స్వామి దైవ బలం మా ప్రభుత్వానికి, సీఎం జగన్ కు ఉండాలని కోరుకున్నా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement