Friday, May 17, 2024

1000 మందికి.. రూ.10 లక్షల స్టడీ మెటీరియల్ పంపిణీ

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు ఉచిత శిక్షణ శిబిరాల్లో 10 లక్షల రూపాయలతో 1000 మంది విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించారు. నియోజకవర్గంలోని చెన్నూరు, రామకృష్ణాపూర్ లలో జైపూర్ బెల్లంపల్లి ఏసీపీలు నరేందర్, మహేష్ లు అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పించారన్నారు. గడచిన వంద రోజులుగా బాల్క ఫౌండేషన్ వారి సహకారంతో మెరుగైన శిక్షణ ఇస్తున్నారన్నారు. బాల్క ఫౌండేషన్ ద్వారా ఉచిత స్టడీ మెటీరియల్ అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ కు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement