Monday, April 29, 2024

ఏసీబీకి చిక్కిన పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఏసీబీ నిర్వహించిన దాడులలో వేములవాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్ర ప్రకాష్‌ పట్టుబడ్డాడు. ఓ కేసుకు సంబంధించి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా హెడ్‌ కానిస్టేబుల్‌ చిక్కాడు. వేములవాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో రూ.6 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement