Monday, April 29, 2024

రైల్వే స్టేషన్ లో పోలీసు బలగాలు.. ప్రయాణికుల కదలికలపై నిఘా..

అగ్నిపథ్ ను నిరసిస్తూ ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్ధం చేయడంతో పెద్దపల్లిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్లలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూరు, ఓదెల, పొత్క, రాఘవపూర్ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి రైల్వే స్టేషన్లను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులతో పాటు ఇతరులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బందోబస్తు లో సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రాజేష్ లక్ష్మణ్, రవీందర్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement