Sunday, May 5, 2024

పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి : మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి

జిల్లా కేంద్రంలోని వ్యాపారులతో పాటు ప్రజలు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పనులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. సోమవారం పట్టణంలోని జండా కూడలిలో వ్యాపారుల నుండి ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ టికి 12 రూపాయల చొప్పున ట్రేడ్ లైసెన్స్ వసూలు చేస్తున్నామన్నారు. ఆస్తి పన్ను బకాయిదారులు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పాత బకాయిలు వెంటనే చెల్లిస్తే వడ్డీలో 90% రాయితీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శివప్రసాద్, శానిటరీ ఇన్ స్పెక్ట‌ర్ రామ్మోహన్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement