Tuesday, May 7, 2024

మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రం ..ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి – రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి నూనేటి సంపత్,జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, ప్యాక్స్ ఛైర్మెన్ లు గజవెల్లి పురుషోత్తం,చదువు రామచంద్రారెడ్డి, మార్కెట్ ఛైర్మెన్ కొట్టే సుజాత-రవి,వైస్ ఛైర్మెన్ తిరుపతి,మాజీ మార్కెట్ ఛైర్మెన్ రామచంద్రారెడ్డి, డైరెక్టర్ చంద్రం,ఇబ్రాహీం,గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ జెట్టి దేవేందర్, సత్యనారాయణ,అక్కల తిరుపతి,శ్రీనివాస్,రాజ్ కుమార్,నవీన్, కిరణ్,రైతులు,గ్రామ పాలక వర్గం,తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement