Saturday, April 27, 2024

మినీ పురు పోరు – ఇన్ ఛార్జీల‌ను నియ‌మించిన టి ఆర్ ఎస్..

హైదరాబాద్‌, : రాష్ట్రంలో ఎన్నికలు జరిగే రెండు కార్పోరేషన్‌లకు, ఐదు మునిసిపాలిటీలకు టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఖమ్మం కార్పోరేషన్‌కు మంత్రి అజయ్‌కుమార్‌, వరంగల్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ లను నియమించింది. సిద్దిపేటకు మంత్రి హరీష్‌రావు, కొత్తూరు మునిసిపాలిటీకి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, అచ్చంపేటకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నకిరేకల్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి, జడ్జర్లకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డిలను నియమించారు. నియమించిన ఇన్‌చార్జ్‌లు అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సమన్వయం చేయడంతో పాటు ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నారు. అభ్యర్థులను గెలిపించే బాధ్యత కూడా అధిష్టానం వీరికి అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement