దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ తీవ్ర స్థాయికి చేరింది. ఆదివారం కొత్తగా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ అయింది. అటు నిన్న 1,44,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 1,619 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,78,769కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,29,53,821 మంది కోలుకున్నారు. 18,01,316 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 12,38,52,566 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా దేశంలో నిన్నటి వరకు మొత్తం 26,78,94,549 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 13,56,133 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement