Thursday, May 16, 2024

శివరాత్రి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మహా శివరాత్రి వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాల వద్ద మహా శివుడి దర్శనం కోసం బారులు తీరారు. స్థానిక శివాలయంలో ఆలయ కమిటీ మహాశివరాత్రి  సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దంపతులు  పట్టణం స్టేషన్ రోడ్ లోని శివ పంచాయతన ఆలయంలో మహాశివుడి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకు న్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement