Tuesday, May 7, 2024

మాది రైతు సంక్షేమ ప్రభుత్వం: ఎమ్మెల్యే దాసరి

తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఓదెల మండలం కొలనూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతాంగం కష్టించి పండించిన పంట కొనుగోలు చేసేందుకు కేంద్రం కిరికిరి పెడుతుందని, అన్నం నష్టపోకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారన్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement