Friday, May 3, 2024

యువతి కిడ్నాప్ పై మంత్రి కేటీఆర్ సీరియస్..

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లీ గ్రామ యువతి కిడ్నాప్ పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను పిలుచుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పై ఆరా తీశారు. మూడపల్లి యువతి కిడ్నాప్ నిందితులను సాయంత్రం లోపు పట్టుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు దురదృష్టం అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరిని ఉపేక్షించొద్దన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement