Thursday, April 25, 2024

నకిలీ మద్యం తయారు, విక్రయంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నకిలీ మద్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసే వారి పైన తయారు చేసే వారిని ఎవరినీ వదిలా పెట్టవద్దని ఆదేశించామన్నారు. ఇక్కడి నుండి ఖాళీ బాటిల్స్, లేబుల్స్ తీసుకొని వెళ్ళి ఒడిస్సా లోని కటక్ అటవీ ప్రాంతంలో తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రమైనా, మనోడైనా, వదిలిపెట్టబోమని నకిలీ మద్యంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్‌ ఇచ్చారు.

గతంలో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జిల్లాల వారీగా తీసుకొచ్చి అమ్ముకునేవారని.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం వలన, ఇతర రాష్ట్రాల్లో వచ్చే మద్యాన్ని కట్టడి చేస్తున్నామన్నారు. ఎక్సైజ్ అధికారులు వద్ద ఆయుధాలు ఉండవని… తలలు పగిలిన, ప్రాణాలు పోతున్న గుడుంబాను అరికట్టామని వెల్లడించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు మొత్తం నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు అయ్యిందని.. ఎక్కడా, ఎవరికి అనుమానం రాకుండా బార్ కోడ్లు ఏర్పాటు చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement