కరీంనగర్ జిల్లా మద్యతరగతి కుటుంబానికి చెందిన వి.రాంగోపాల్ కుమారుడు వి.శ్రీధర్ సివిల్స్ లో 336వ ర్యాంకుతో సత్తా చాటడం జిల్లాకే గర్వకారణం అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మంత్రి నివాసంలో కరీంనగర్ జిల్లా కానిస్టేబుల్ కుమారుడు శ్రీధర్ గంగుల కమలాకర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్ ను మంత్రి గంగుల శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు , కార్పొరేటర్ పిట్టల శ్రీనివాస్ , మేదరి సంఘం అధ్యక్షుడు ఏకుల రాజనర్సు తదితరులున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.