Sunday, May 5, 2024

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌

ముత్తారం: ప్రతి గ్రామంలో యధావిధిగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు- చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం పట్ల మండల కేంద్రంలోని అడవిశ్రీరాంపూర్‌ చౌరస్తాలో తెరాస నాయకులు సంబరాలు చేసుకున్నారు. బుధవారం సీఎం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ మరోసారి రైతు పక్షపాతినని నిరూపించారన్నారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అత్తె చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్‌, తెరాస మండల అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సుదాటి రవీందర్‌రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నూనె కుమార్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ నాంసాని సమ్మయ్య, సర్పంచ్‌లు నెత్తెట్ల మహేందర్‌, తుంగాని సమ్మయ్య, వేల్పూరి సంపత్‌రావు, మేడగోని సతీష్‌, ఎర్రం శారద సదానందం, మాజీ సర్పంచ్‌ ఇల్లందుల అశోక్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ కురాకుల ఓదెలులతోపాటు తెరాస నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement