Thursday, April 25, 2024

నూతన అధ్యక్షుని ఎన్నిక

గోదావరిఖని: కార్పోరేషన్‌ పరిధిలోని అడ్డగుంటపల్లి హమాలీ సంఘం కార్యాలయంలో సంఘం సభ్యుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడుగా 42వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాల రాజ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాజ్‌కుమార్‌ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ సంఘానికి అందుబాటు-లో ఉంటూ న్యాయమైన సమస్యల కోసం ముందుండి పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో రామాంజనేయ, హమాలీ సంఘం గూడ్స్‌ ట్రాన్స్‌ పోర్ట్‌, కిరాణం మార్కెట్‌ విభాగం నాయకులు రవి, నరసయ్య, రవి, ఐలయ్య, రాజయ్య, రమేష్‌, కనకరాజు, శంకర్‌, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, రాజు, నాగరాజు, అరవింద్‌, రమేష్‌, చందు, మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement