Sunday, April 28, 2024

క్షయ వ్యాధి నివారణపై అవగాహన

ముత్తారం: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ సందర్భంగా టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, లక్షణాలు కలిగిన వారు చికిత్స చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం క్షయ నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement