Monday, April 29, 2024

అక్ర‌మంగా బంగారం తీసుకొచ్చిన ఇద్ద‌రు అరెస్ట్..

గన్నవరం విమానాశ్రయం లో దుబాయ్ నుంచి దొంగ‌చాటుగా బంగారం తీసుకొచ్చిన ఇద్ద‌రిని క‌స్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.. నేటి ఉద‌యం దుబాయ్ నుంచి వ‌చ్చిన ఉత్తరప్రదేశ్ కు చెందిన కాసీం అన్సారీ, కర్ణాటక కు చెందిన ఇంతియాజ్ అహ్మద్ లు అనుమాన‌స్ప‌దంగా క‌నిపించ‌డంతో వారిని క‌స్ట‌మ్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.. అనంత‌రం స్కాన్ చేశారు.. ఒక‌రి మ‌లం ద్వారం వ‌ద్ద‌, మ‌రోక‌రి క‌డుపులోను బంగారం ఉన్న‌ట్లు గుర్తించారు… ఈ బంగారం బ‌రువు 200 గ్రాముల వ‌ర‌కు ఉండోచ్చ‌ని అంటున్నారు… క‌డుపులోని బంగారం తీసేందుకు వారిని హాస్ప‌ట‌ల్లో చేర్చారు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement