Tuesday, May 14, 2024

పాలిటెక్నిక్‌ కళాశాలలో కరోనా కలకలం..

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కరోనా కలకలం రేపింది. కళాశాలలోని 146 మంది విద్యార్థులు, సిబ్బందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వారిలో 20 మందికి కరోనా పాజిటీవ్‌గా నిర్దారణ అయింది. కరోనా సోకిన వారిలో 12 మంది సిబ్బంది, 8 మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా సోకిన వారిని హోం ఐసోలేషన్‌కు తరలించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కళాశాలలో 20 మందికి కరోనా పాజిటీవ్‌ నిర్దారణ కావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement