Tuesday, May 7, 2024

నిరుపేద ఆడపిల్లలకు వరం కల్యాణ లక్ష్మి : ఎమ్మెల్యే దాసరి

పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం వరంగా మారిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో పెద్దపల్లి మండలంలోని 199 మంది లబ్ధిదారులకు 1,98,98,084 రూపాయల షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నిరుపేద కుటుంబంలో పెద్ద కొడుకు పాత్రను పోషిస్తూ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ద్వారా లక్షా 116 రూపాయలు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాజయ్య, కౌన్సిలర్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పట్టణాధ్యక్షుడు, ఉప సర్పంచ్ లు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement